Saturday, April 27, 2024
- Advertisement -

హుషారుగా నాగార్జున

- Advertisement -

అక్కినేని నాగార్జున ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారు. ఒకవైపు తను హథీరాం బాబాగా నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ షూటింగ్ శరవేగంగా పూర్తి అయిపోతుండడం.. మరోవైపు ఇద్దరు తనయుల కొత్త సినిమాలపై ప్రకటన చేయడంతో ఆయనలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ అప్ డేట్స్ చెప్పడం నాగ్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు సంగతులను పంచుకున్న నాగార్జున.. తనయుల ఇద్దరి పెళ్లిపై కూడా మాట్లాడారు. నాగ చైతన్య.. అఖిల్ లు తమ జీవిత భాగస్వాములను తామే ఎంచుకోవడం సంతోషమే అన్న నాగ్.. వారి పెళ్లికి సంబంధించిన డీటైల్స్ ను అనౌన్స్ చేసేందుకు ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ పెడతానని చెప్పడం విశేషం.

ఇప్పటికైతే ఓం నమో వెంకటేశాయ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పిన నాగ్.. అక్టోబర్ చివరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని అన్నారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఆయన.. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా బంగార్రాజు ప్రారంభమవుతుందని అన్నారు. ఇక కళ్యాణ్ కృష్ణతో చైతు చేయనున్న మూవీ నిన్నే పెళ్లాడుతా స్థాయిలో ఉంటుందని.. అఖిల్-విక్రమ్ కుమార్ ల సినిమా కూడా అక్టోబర్ లో షూటింగ్ మొదలువుతుందని చెప్పారు నాగ్.

Related

  1. సూపర్ హిట్ కొట్టేసిన నాగ చైతన్య
  2. సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?
  3. అదరగొట్టిన నాగ చైతన్య!
  4. అఖిల్‌ కి ఏం చేయాలో అర్ధం కాక ఈ పని చేస్తున్నాడు!
  5. ఎవరీ అఖిల్ లవర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -