మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందరు స్టార్హీరోలున్నా చిరు రేంజే వేరు. మెగాస్టార్తో సినిమాలో ఒక్క సారైనా కలిసి నటించాలని పేరున్న హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. అవకాశం రావాలే గానీ రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచించరు. ఎగిరిగంతేసి మరీ నటించేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది జబర్దస్త్ ఫేం గౌతమ్ రష్మి.
చిరు హీరోగా నటిస్తున్నచిత్రం బోళా శంకర్. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథా నాయిక. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసేందుకు రష్మిని సంప్రదించిన నిర్మాతకు పెద్ద షాకే తగిలింది.
ఐటం సాంగ్కు గాను రష్మి ఏకంగా రూ.50 లక్షలు డిమాండ్ చేసిందని ఫిలింనగర్లో టాక్. దీంతో ఆ నిర్మాతకు షాక్ తగినంతపనైంది. మరో పక్క ఈ విషయం తెలిసిన మెగాస్టార్ అభిమానులు సైతం ఏంటి.. రష్మి రేంజ్ ఇంతలా పెరిగిందా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడితో గొడవపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్