- Advertisement -
తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తుంది.మహనటి సినిమా తరువాత ఈ జోరు మరింత ఊపు అందుకుంది.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ .. వైఎస్సార్ బయోపిక్లతో పాటు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్లు తెరకెక్కితున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో బయోపిక్ తెరకెక్కుతుంది. ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన టైగర్ నాగేశ్వరరావు ,చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు.
ఈయన జీవితాన్ని సినిమాగా తీయడానికి సన్నాహలు చేస్తున్నారు.ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావుగా న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తాడని సమాచారం.మొదట ఈ సినిమాలో హీరో రానాని తీసుకున్నారు.అయితే రానా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో చిత్ర యూనిట్ నాని సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు.మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.