Wednesday, May 1, 2024
- Advertisement -

ఆర్జీవీ వ్యూహంపై లోకేష్‌!

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీడీపీ నేత నారా లోకేష్‌. వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరారు. వర్మకు జగన్ అంటే ఇష్టమని చంద్రబాబు, పవన్ అంటే పడరని తన పిటిషన్‌లో పేర్కొన్నాఉ.

తనకు ఇష్టం వచ్చినట్లు సినిమా తీశారని.. సమాజంలో పేరున్న చంద్రబాబును తప్పుగా చూపించారని చెప్పారు. చంద్రబాబును అప్రతిష్ఠ పాలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనిని అడ్డుకోవాలని కోరారు.

ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని… ఈ సినిమాల వల్ల నష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ జగన్ కోసం వర్మ రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరగా డిసెంబరు 27న తదుపరి విచారణ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -