టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సంవత్సరం ‘అల్లుడు అదుర్స్’ అంటూ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర నిరాశ పరిచాడు. సినిమా ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించలేకపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘ అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ చిత్రంతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో నటిస్తున్నాడు. ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ అవుతున్నాడని సమాచారం.ఈ మూవీని బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు సినిమా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారట.
Also read:గొప్ప డైరెక్టర్ ఇక లేరన్న వార్త బాధాకరం.. అల్లు అర్జున్!
బెల్లంకొండ శ్రీనివాస్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ నీ కూడా హీరో చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలో తమిళ్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘కర్ణన్’సినిమాను రెండో కుమారుడితో రీమేక్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.అసలు అలాంటి స్క్రిప్ట్లో శ్రీనివాస్ కానీ, అతను తమ్ముడు గణేష్ కానీ నటిస్తే ఉన్న పరువు కూడా పోతుందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.అయితే బెల్లంకొండ హీరోల్లో ఏ హీరోతో ఈ సినిమా రీమేక్ చేస్తారా.. అనే చర్చ జరుగుతోంది.
Also read:ఎన్టీఆర్ రండి గెలుద్దాం అంటూ వెనకడుగు.. నిరాశలో అభిమానులు!