Saturday, May 18, 2024
- Advertisement -

అంధురాలి పాత్రతో ఎంతో మారాను అంటున్న హీరోయిన్

- Advertisement -

కాజోల్. చందమామ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. మగధీర చిత్రంతో నటిగా తానేంటో నిరూపించుకున్న నటి. బాలీవుడ్ ల సింగం, స్పెషల్ 26 చిత్రాలతో ఆకట్టుకున్న కాజోల్ ఓ నిర్ణయం తీసుకుంది. అదే తన కళ్లను దానం చేయాలని. బాలీవుడ్ లో రణదీప్ హూడా హీరోగా, కాజల్ హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం దో లఫ్జోంకీ కహాని చిత్రంలో కాజల్ అంధురాలిగా నటించింది.

ఈ చిత్రం శుక్రవారంనాడు విడుదల కానుంది. ఈ సినిమాలో నటించిన తర్వాత అంధుల జీవితాలు ఎలా ఉంటాయో తొలిసారిగా తెలుసుకున్నానని, అందుకే కళ్లను దానం చేయాలనుకుంటున్నానని కాజల్ చెప్పింది. ఈ సినిమాలో తన పాత్ర సహజసిద్ధంగా ఉండేందుకు కాజల్ కొంతమంది అంధులైన బాలికలను కూడా కలిసింది.

వారిని కలిసిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత కళ్లు దానం చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. అంధురాలి పాత్ర తన జీవితంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని కాజల్ చెప్పింది.  ఈ చిత్రంలో తనతో పాటు నటించిన హీరో రణదీప్ హూడా కూడా మరణానంతరం తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -