Saturday, April 20, 2024
- Advertisement -

ఆహాలో సందడి చేయనున్న క్యూట్ భామ

- Advertisement -

క్యూట్ మళయాళీ భామ నిత్యా మీనన్‌కు బంఫర్ ఆఫర్ వచ్చింది. నిత్యా మీనన్ ‘ఆహా’లో వచ్చే ఓ షో కోసం జడ్జ్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిత్యా మీనన్ మంచి నటి మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. ఇప్పటికే కొన్ని సినిమాలో పాటలు కూడా పాడారు.

ఆ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఆహా వారు మొదలు పెట్టబోతున్న లేటెస్ట్ ‘ఇండియన్ ఐడల్’ మ్యూజిక్ రియాల్టీ షో కోసం జడ్జ్‌గా ఎంపిక చేశారట. ఇప్పటికే దీని ప్రోమో కూడా వదిలారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ రియాల్టీ షోకి ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు. అలాగే, ఇప్పుడు నిత్యా మీనన్ కూడా మరో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

ఆమె పేరును రివీల్ చేయకుండా ఇప్పటికే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ షో హోస్టింగ్ బాధ్యతలను ఇండియన్ ఐడిల్ విజేత, ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్రకు అప్పగించారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది. మరోవైపు నిత్యా.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘భీమ్లా నాయక్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మ‌ళ్లీ కౌబాయ్ గా మహేశ్ ?

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -