Thursday, April 25, 2024
- Advertisement -

ఇంతకీ పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరూ? నిత్యానా, సమంతానా..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా మూడు నెలల పాటు షూటింగ్ లు నిలిచిపోవడంతో పవన్ నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ రెండు సినిమాల్లో పవన్ ముందుగా హరిహర వీరమల్లు పూర్తి చేయాలని భావించారు. అయితే ఆ సినిమా చారిత్రక కథాంశంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, గ్రాఫిక్ వర్క్ కూడా చేయాల్సి ఉండటంతో ఆ సినిమాకు ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంది. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

దీంతో పవన్ కళ్యాణ్ తన ప్లాన్ కూడా మార్చుకున్నారని టాక్. ముందు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాపైకి వెళ్లాలని ఆయన భావిస్తున్నారట. ఇప్పటికే మలయాళ రీమేక్ సినిమా 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది ఎవరు.. అనేది సందిగ్ధంగా మారింది.మొదట ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ ను తీసుకున్నట్టు సమాచారం వచ్చింది. ఆ తర్వాత సమంత లైన్ లోకి వచ్చినట్లు టాక్ వచ్చింది. ఇవి పుకార్లు మాత్రమేనని, అయ్యప్పనుమ్ కోషియమ్ లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరూ అన్న రూమర్స్ తో పవన్ ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఈ సినిమా మేకర్స్ స్పష్టం చేస్తే కానీ ఈ పుకార్లు ఆగేలా కనిపించడం లేదు.

Also Read

రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని… తర్వాత ఏమైందంటే..!

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -