తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుకు మంచు విష్ణు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా విష్ణు సరసన కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా భక్త కన్నప్ప. మోహన్ బాబు , అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక సినిమా పూజా కార్యక్రమాలు అప్పుడే ప్రారంభమయ్యాయో లేదో ఈ ప్రాజెక్టు నుండి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విస్ణే వెల్లడించారు. కన్నప్ప చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేసే విషయంలో సమస్యలు తలెత్తడంతో నుపుర్ తప్పుకుందన్నారు. ఆమె సినిమా నుండి తప్పుకుందని చెప్పడం బాధగా ఉందని…మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టామని తెలిపారు విష్ణు.
ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఆమె ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఆసక్తికరమైన రోజులు రాబోతున్నాయి.. అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి అని విష్ణు వెల్లడించారు. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు.