Sunday, May 5, 2024
- Advertisement -

రొమాన్స్ చేయ‌డంలో శౌర్య వేస్ట్ అని కామెంట్ చేసిన సమంత

- Advertisement -

సమంత ఓ బేబీ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా లో నాగ శౌర్య ఒక కీలక పాత్ర ని పోషించాడు. ఇప్పటి వరకు నాగ శౌర్య ఇలాంటి పాత్ర చేయలేదు. కంప్లీట్ గా హీరో పాత్ర కాదు కానీ కొంచెం కథ లో ముఖ్యమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ప్రస్తుతం నాలో మైమరపు అనే పాట ని విడుదల చేశారు. ఈ సినిమా లో ఈ పాట సమంత, శౌర్య మీద తీశారు.

ఈ సినిమా మేకింగ్ వీడియో లో మాట్లాడుతూ, రొమాన్స్ చేయడం లో నాగ శౌర్య వేస్ట్ అనే కామెంట్స్ చేసింది.అయితే ఆవిడ ఈ మాట ని సీరియస్ గా అనకపోయినా మన మీడియా వాళ్ళు ఇప్పటికీ దాన్ని పట్టుకొని తెగ హడావుడి చేస్తున్నారు. శౌర్య కి చాలా సిగ్గు అని, అసలు షాట్ గాప్ ఉంటె దూరం గా వెళ్లిపోతాడు అని, అతని తో రొమాన్స్ చేయడం కష్టం అని సమంత అభిప్రాయపడింది.

అయితే దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఈ విషయం లో స్పందించింది. శౌర్య కి సిగ్గు అని, సమంత తో శౌర్య కలవడానికి వారిద్దరూ కుక్కలా గురించి మాట్లాడుకొనే వాళ్ళని, అలా శౌర్య మెల్లగా సిగ్గు ని వదిలిపెట్టి షూట్ లో ఇన్వాల్వ్ అయ్యే వాడు అని ఆవిడ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -