Sunday, May 19, 2024
- Advertisement -

‘సాక్ష్యం’ గెస్ట్‌గా ప‌వ‌న్‌!

- Advertisement -

న‌టుడు,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు మానేసిన సీని ఇండ‌స్ట్రీకి మాత్రం దూరం కాలేద‌నే చెప్పాలి.ఆయ‌న నిత్యం ఏదో ఒక సినిమా ఫంక్ష‌న్‌కు వ‌స్తునే ఉన్నారు.నితిన్ న‌టించిన చ‌ల్ మోహ‌న రంగా సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చాడు ప‌వ‌న్‌. ఈ సినిమాకు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హారించాడు ప‌వ‌న్‌.కాని ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయింది.

త‌రువాత త‌న అన్న కొడుకు రాంచ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమా స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి త‌న అభినంద‌న‌లు తెల‌పడంతో పాటు సినిమాను అస్కార్‌కు పంపాల‌ని కోరాడు.దీని త‌రువాత ఒకేరోజు రెండు సినిమా ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చాడు ప‌వ‌న్‌.అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య సినిమా స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి బ‌న్నీకి త‌న స‌పోర్టు తెలియ‌జేశాడు.వెంట‌నే ర‌వితేజ న‌టించిన నేల టిక్కెట్టు సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా పొల్గోన్నాడు ప‌వ‌న్‌.ఇక ఇప్పుడు మ‌రో సినిమా ఆడియో ప్రీ రీలిజ్ ఈవెంట్‌కు ప‌వ‌న్ వ‌స్తున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో ‘సాక్ష్యం’ సినిమా వ‌స్తుంది. ఈ సినిమా ఆడియో ఈవెంట్‌కు ప‌వ‌న్‌ని తీసుకురావ‌ల‌ని చిత్ర యూనిట్ ఆలోచ‌న‌.ఆ దిశ‌గా ప‌వ‌న్‌తో చ‌ర్చ‌లు న‌డిపిన శ్రీవాస్‌కు ప‌వ‌న్ నుండి గ్రీన్ సీగ్న‌ల్ వ‌చ్చింద‌ని స‌మాచారం.ఈ సినిమాలో బెల్లంకొండ‌కు జోడిగా పూజ హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది.

https://www.youtube.com/watch?v=J61sWQH05Qs

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -