ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జీవిత కథను యాత్ర సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.వైఎస్ఆర్ పాత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న(ఆదివారం) వైఎస్ఆర్ 9వ వర్థంతి సందర్భంగా యాత్ర సినిమాలోని లిరికల్ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.వైఎస్ కు జనం జేజేలు పలుకుతూ పాడే కీర్తి గీతం ఇది. నిజానికి ఇప్పుడు ఈపాట విడుదల చేయడం అంటే సాహసమే. ఎందుకుంటే, సినిమా వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఎలా వుండేదీ ప్రేక్షకులకు క్లియర్ గా తెలిసిపోతుంది.
ఫస్ట్ లుక్ వదలడం వేరు. అది జస్ట్ స్టిల్ మాత్రమే. ఇది ఫుల్ సాంగ్.ఈ సినిమా కోసం కొత్త రకమైన జెండాను డిజైన్ చేయించారు.కాంగ్రెస్ రంగుల జెండాపై పిడికిలి బిగించిన చేయి గుర్తు జోడించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త గుర్తు కనిపించినట్లు అయింది.అందరు యాత్ర సినిమాలో పవన్ గుర్తుని పెట్టుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ విషయం పక్కన పెడితే యాత్ర సినిమాలో సాంగ్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.సినిమను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.