సినిమా వేడుకలు, ఆడియో వేడుకలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన హీరోల ఆడియో వేడుకలకే పవన్ వెళ్లరు. ఆ మధ్య నితిన్ రావాలి అని ఒత్తిడి చేయడంతో ఆ మధ్య ఓ సారి ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మనవుడు, కర్నాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్ తో ‘జాగ్వార్’ సినిమాని తీసారు.
అయితే ఈ సినిమా ఆడియో పంక్షన్ కు ముఖ్య అతిథిగా రావాలని పవన్ కళ్యాణ్ ను కుమారస్వామి స్వయంగా ఆహ్వానించారు. అయితే ఈ ఆడియో వేడుకకు పవన్ వస్తాడని బాగానే ప్రచారం జరిగింది. అయితే అందరు అనుకున్నట్లు ఈ వేడుకకు పవన్ రాలేదు. ఇటీవల మారిన కొన్ని పరిస్థితులతో ఆయన చాలా బిజీ అయ్యారు.
ఈ విషయమై కుమారస్వామికి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ ఆడియో వేడుకకు రాలేకపోతున్నానని, ఈ చిత్ర సక్సెస్ మీట్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడట. దీనికి వెంటనే కుమారస్వామి బదులిస్తూ సినిమా విడుదలైన వారంలోపే విశాఖలో సక్సెస్మీట్ నిర్వహిస్తామని, దానికి తప్పకుండా రావాలని చెప్పారట కుమారస్వామి.
Related