Friday, April 26, 2024
- Advertisement -

అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో నటి పాయల్?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీకి ” RX 100 ” మూవీ ద్వారా పరిచయమైన పంజాబీ బ్యూటీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో కట్టిపడేసి వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎంతో అభిమానించే, తనకు ఇష్టమైన అనితా ఆంటీ కరోనా కారణంగా మృతి చెందిన విషయం మరువక ముందే మరో సన్నిహితమైన వ్యక్తినీ కోల్పోవాల్సి వచ్చిందని, నాజీవితంలో ఇంతటి క్లిష్టమైన పరిస్థితులు చూడటం ఇదే తొలిసారి. మానసికంగా కుంగిపోయి చాలా ఆందోళన చెందుతున్నా. నా బాధను బయటకు చెప్పడానికి మాటలు చాలవు.అంటూ తీవ్ర ఆవేదన చెందుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా తన బాధను అభిమానులతో పంచుకున్నారు.

Also read:రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన కృతి శెట్టి?

అలాగే దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులు తగ్గుముఖం పట్టే వరకు అందరూ ఇంటికే పరిమితమై తమ ప్రియమైన వారిని సంరక్షించుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ క్షేమంగా ఉండాలని తన అభిమానులకు ఈ సందర్భంగా సూచించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -