హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం ’పెంగ్విన్’ ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. మొత్తానికి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల చేస్తున్నారు.
ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. సమంత, తాప్సీ, మంజువారియర్, త్రిష కలిసి తమ సామాజిక మాధ్యమాల ద్వారా పలు భాషల్లోని ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఈ టీజర్ ఆసక్తిని పెంచుతోంది. ఇది ఓ సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.
‘ఈ సృష్టిలో ప్రతీ ఒక్క వ్యక్తి కథ వెనుక తల్లి ఉంటుంది. ఎందుకంటే తల్లితోనే మన జీవితం మొదలవుతుంది’ అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం కథ ఉంటుందని తెలుస్తుంది. ఓ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి చేసే శారీరక, భావోద్వేగ ప్రయాణమే ఈ ‘పెంగ్విన్’ అని తెలుస్తుంది. మీరు కూడా ఈ టీజర్ ని చూడండి.