Thursday, April 25, 2024
- Advertisement -

విశాల్​, ఆర్​బీచౌదరి మధ్య గొడవ.. ఇద్దరికీ పోలీసుల సమన్లు..!

- Advertisement -

ప్రముఖ తమిళ హీరో విశాల్​ నిత్యం ఏదో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో ఆయనకు ఓ నటితో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఆర్​బీ చౌదరి తో గొడవ పెట్టుకున్నాడు విశాల్​. ఈ గొడవ పోలీసుల దాకా చేరింది. చివరకు పోలీసులు ఇద్దరికీ సమన్లు జారీ చేశారు. స్టేషన్​ కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గతంలో విశాల్​ ‘ఇరుంబు తిరై’ అనే ఓ చిత్రంలో నటించాడు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత ఆర్​బీ చౌదరి దగ్గర కొంత రుణం తీసుకున్నాడు. ఆ టైంలో కొన్ని డాక్యుమెంట్లు, చెక్కులు ఆర్​బీ చౌదరికి ఇచ్చాడు. అయితే విశాల్ ఆ రుణం చెల్లించినప్పటికీ.. ఆర్​బీ చౌదరి మాత్రం అందుకు సంబంధించిన పత్రాలను, చెక్కులు తిరిగి ఇవ్వలేదు. దీంతో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆయన టీ నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: #PSPK28 : పవర్ ఫుల్ టైటిల్ ‘స్టేట్ కి ఒక్కడు’..!

ఈ విషయంపై ఆర్​బీ చౌదరి మాట్లాడుతూ.. ‘ విశాల్​ .. నాదగ్గర అప్పు తీసుకున్న విషయం నిజమే. నాతోపాటు తిరుపూర్​ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు. అయితే విశాల్​ ఇచ్చిన చెక్కులు, డాక్యుమెంట్లు ప్రముఖ దర్శకుడు శివకుమార్​ చూసుకొనేవారు. కానీ ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ పత్రాలు మిస్​ అయ్యాయి. విశాల్ మాత్రం.. తనకు భవిష్యత్​లో ఇబ్బందులు తలెత్తుతాయని భయపడుతున్నారు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపించారు. స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు.

Also Read: చెర్రీతో మాళవికా మోహనన్​ రొమాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -