ప్రముఖ తమిళ హీరో విశాల్ నిత్యం ఏదో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో ఆయనకు ఓ నటితో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి తో గొడవ పెట్టుకున్నాడు విశాల్. ఈ గొడవ పోలీసుల దాకా చేరింది. చివరకు పోలీసులు ఇద్దరికీ సమన్లు జారీ చేశారు. స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గతంలో విశాల్ ‘ఇరుంబు తిరై’ అనే ఓ చిత్రంలో నటించాడు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దగ్గర కొంత రుణం తీసుకున్నాడు. ఆ టైంలో కొన్ని డాక్యుమెంట్లు, చెక్కులు ఆర్బీ చౌదరికి ఇచ్చాడు. అయితే విశాల్ ఆ రుణం చెల్లించినప్పటికీ.. ఆర్బీ చౌదరి మాత్రం అందుకు సంబంధించిన పత్రాలను, చెక్కులు తిరిగి ఇవ్వలేదు. దీంతో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆయన టీ నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: #PSPK28 : పవర్ ఫుల్ టైటిల్ ‘స్టేట్ కి ఒక్కడు’..!
ఈ విషయంపై ఆర్బీ చౌదరి మాట్లాడుతూ.. ‘ విశాల్ .. నాదగ్గర అప్పు తీసుకున్న విషయం నిజమే. నాతోపాటు తిరుపూర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు. అయితే విశాల్ ఇచ్చిన చెక్కులు, డాక్యుమెంట్లు ప్రముఖ దర్శకుడు శివకుమార్ చూసుకొనేవారు. కానీ ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ పత్రాలు మిస్ అయ్యాయి. విశాల్ మాత్రం.. తనకు భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తుతాయని భయపడుతున్నారు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపించారు. స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు.
Also Read: చెర్రీతో మాళవికా మోహనన్ రొమాన్స్..!