పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సెట్స్ పై ఉన్నప్పటికీ అభిమానులు ఆసక్తి మాత్రం పవన్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకున్నా ఈ సినిమాకు సంబంధించిన జోష్ మాత్రం ఇప్పటికే హై రేంజ్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా ప్రారంభించాలని అభిమానులు పదేపదే విన్నవిస్తున్నారు. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని, పవన్ 28వ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
రెండు రోజుల కిందట ఫ్యాన్సే ఏకంగా పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ ను చూసిన నాగబాబు కూడా స్పందించారు. వావ్ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు తాజాగా అభిమానులు పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఇదే అంటూ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా?
ఈ సినిమాకు టైటిల్ ‘ స్టేట్ కి ఒక్కడు’ అని పెట్టారు. పోస్టర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. ఈ టైటిల్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ టైటిల్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కాగా జూలై నుంచి పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, ఆ తర్వాత హరిహర వీరమల్లుకు డేట్స్ కేటాయించనున్నాడు. ఈ రెండు ఫినిష్ చేసిన తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా మొదలు కానుంది. కాగా ఇటీవల హరీష్ శంకర్ కూడా పవన్ తో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్ ఇదే..! ప్లస్ అయి మైనస్ అయితే..!