- Advertisement -
మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అను నేను సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.మహేష్ బాబు కెరీర్లోనే సూపర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం.అయితే తాజగా ఈ సినిమాపై గుంటురు పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు నమోదైంది.
సినిమాలో తమ పార్టీ జెండాను ,గుర్తును తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ‘నవోదయం పార్టీ’ అధ్యక్షుడు నల్లకరాజు అనే వ్యక్తి సోమవారం ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్తో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు ఆయన తెలిపారు.పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా సినిమాలో చూపించారని ఆరోపించారు. దీనిపై నవోదయం పార్టీ తరఫున ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు.