బాహుబలి, సాహో చిత్రాల తర్వాత పాన్ ఇండియా హీరో మారారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈనెల 23న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఐదు భాషల్లో ట్రీజర్ను విడుదల చేశారు. ప్రభాస్ తన అభిమానుల చేతుల మీదుగా ట్రీజర్ను విడుదల చేసి నాను ప్రత్యేక మైన వ్యక్తిగా చాటుకున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ప్రభాస్ మాట్లాడారు. అభిమానుల చేతుల మీదుగా ట్రీజర్ను విడుదల చేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. సినిమా తన అభిమానులకు నచ్చుతుందని చెప్పారు. ఈ సినిమా కథను రాయడానికి డైరెక్టర్ కేకే రాధా కృష్ణకుమార్కు 18 ఏళ్లు పట్టిందని అలాగే తీసేందుకు ఐదేళ్లు పట్టిందని చెప్పారు. అంటే సినిమా ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశం మొత్తం ఎంతో తిరిగానని, ఎన్నో వేదికలపై మాట్లాడానని చెప్పారు. కానీ నేడు రాధేశ్యామ్ వేదికపై నుంచి మాట్లాడాలంటే మాత్రం ఎందుకో టెన్షన్గా ఉందన్నారు. వేదికల పై నుంచి మాట్లాడాలంటే తనకు ఇప్పటికీ భయం పోవడం లేదని , బహుషా నేనింతేనేమో అని సరదాగా అన్నారు. అభిమానులకు అన్ని రకాలుగా నచ్చేలా ఎంతో కష్టపడి సినిమాను తీశామని తెలిపారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ బ్యూటీ రష్మి