ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కరోనా వైరస్ సోకడంతో టాలీవుడ్ అలర్ట్ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలడంతో క్వారంటైన్కు తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. హైదరబాద్ లో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.
బండ్ల గణేష్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఉన్న కాలనీలో ఉంటున్నారు. ఇక్కడ నుంచి తన సొంత ఊరు షాద్ నగర్కు పౌల్ట్రీ వ్యాపార పనుల కోసం వెళ్లి వస్తుంటారు. ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది.
బండ్ల గణేష్కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రకంపనాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు? ఆయనతో ఎవరు భేటి అయ్యారు అనే కోణంలో అదికారులు డేటా సేకరిస్తున్నారు. బండ్ల గణేష్ కరోనా వైరస్ సోకడంతో ఆయనను క్వారంటైన్కు తరలించి ప్రముఖ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
100 రోజుల తర్వాత ఇంటికొచ్చిన విష్ణు భార్య పిల్లలు..!
మరోసారి పెద్దమనసు చాటుకున్న ఉపాసన..!