తనయుడి సినిమాపై పూరీ ప్రత్యేకాసక్తి
సినిమాలను ప్రకటించిన మూడు, నాలుగు నెలలోపు పూర్తి చేసే స్టైల్ పూరీ జగన్నాథ్. అలా ప్రకటించి పూర్తి చేసిన సినిమాలు మంచి హిట్గా నిలిచాయి. పక్కా మాస్ సినిమాలు తీయాలంటే పూరీ కరెక్ట్. అలాంటి పూరి ఎందరో హీరోలకు హిట్లు ఇచ్చాడు. ప్రస్తుతం అతడు సినిమాల పరాజయాలతో సతమతమవుతున్నాడు. బాలకృష్ణతో తీసిన సినిమా పైసా వసూల్ మంచి వసూళ్ల సాధించి పరాజయమైంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా తన కొడుకు ఆకాశ్తోనే చేస్తున్నాడు.
బాలనటుడిగా ఆకట్టుకున్న ఆకాశ్ తొలిసారి హీరోగా తన తండ్రి దర్శకత్వంలోనే చేస్తున్నాడు. కొడుకు అని పూరీ ఆలస్యం చేయకుండా అన్ని సినిమాల మాదిరి త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాడు. ఈ మధ్యే హైదరాబాద్ షూటింగ్ పర్తి చేసి త్వరలోనే మధ్యప్రదేశ్తో పాటు లడక్లోనూ షూటింగ్ చేయడానికి ప్లాన్ వేశాడు. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్.
అయితే ఈ సినిమా కథ ఏళ్ల కిందట కథతో పాటు దీనికి పునర్జన్మల నేపథ్యం టచ్ ఇస్తున్నాట జగన్నాథ్. హీరోతోపాటు హీరోయిన్ కూడా ఇండో పాక్ వార్లో చనిపోయి ఇప్పుడు మళ్లీ జన్మెత్తుతారని తెలుస్తోంది. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా నేహాశెట్టి నటిస్తోంది. భారత అబ్బాయి.. పాక్ అమ్మాయి మధ్య ప్రేమ కథ అనేదే పెద్ద కమర్షియల్ పాయింట్. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆసక్తికరంగా ఉంది.