Saturday, May 11, 2024
- Advertisement -

తమ్ముడి సినిమా ఓపెనింగ్ డుమ్మా కొట్టిన పూరి

- Advertisement -

సంచనలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడి గా తెలుగు సినిమా పరిశ్రమ లో కొంత పేరు సంపాదించుకున్న హీరో సాయిరాం శంకర్. హీరో గా సినిమాలు చేస్తూ నే సొంతం గా తాను కూడా హీరోగా సినిమాలు చేసి ఎంతో కొంత విజయం లో నడవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. అప్పుడెప్పుడో బంపర్ ఆఫర్ అనే సినిమా తో హిట్ కొట్టిన సాయి కి ఆ తర్వాత విజయం కరువయింది. ఇప్పటి వరకు ఆయన మళ్ళీ విజయ పథం లో నడిచిన దాఖలాలు లేవు.

ఇప్పుడు తాజా గా ఆయన ఒక కొత్త చిత్రాన్ని ఒప్పుకున్నారు. కృష్ణ చిరుమామిళ్ల దర్శకత్వం లో త్వరలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా తో కృష్ణ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన లాంచ్ కార్యక్రమాలు ఇటీవలే తలుపులమ్మ లోవ గుడి లో జరిగాయి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యారు.

కాకపోతే పూరి జగన్ మాత్రం ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. మీడియా లో చాలా రూమర్స్ వినిపిస్తున్నా కేవలం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ తో బిజీ గా ఉండటం వలనే పూరి ఈ ఈవెంట్ కి వెళ్లలేకపోయారని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -