Friday, March 29, 2024
- Advertisement -

న‌య‌న‌తార‌పై వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేసిన న‌టుడు

- Advertisement -

త‌మిళ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌పై ఓ న‌టుడు, రాజకీయ నాయ‌కుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…. త‌మిళ ఇండ‌స్ట్రీలో న‌టుడు రాధారవికి మంచి పేరుంది. ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు రాధార‌వి. హీరో విజ‌య్ న‌టించిన స‌ర్కార్ సినిమాలో కూడా ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సినిమాల్లోనే కాక ఆయ‌న రాజ‌కీయాల్లో కూడా రాణించాడు . గ‌తంలో ఆయ‌న డీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అఆంటి వ్య‌క్తి న‌య‌న‌తార గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. నయనతార తాజాగా నటించిన చిత్రం కొలైయుధీర్‌ కాలం. ఈ సినిమా హార్ర‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. నయనతార ఈ చిత్ర ఆడియో విడుదలకు కూడా గైర్హాజరు అయ్యారు.

ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాధార‌వి మాట్లాడుతు… నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో నాయకిగా కొనసాగడం పెద్ద విషయమే. అయితే ఆమె గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ అధిగమించి నిలబడింది. అయితే న‌య‌న‌తార‌ను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. న‌య‌న‌తార‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో రాధార‌విని పార్టీ నుంచి సస్పెన్షన్ వేసింది డీఎంకే. రాధారవి వ్యాఖ్యలపై దర్శకుడు న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ మండిపడ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -