- Advertisement -
టాలీవుడ్ యంగ్హీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు బ్యాంక్ ఉద్యోగి.విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్నారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 9.85 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు. అధికారుల తనిఖీల్లో నకిలీ బంగారం బయటపడటంతో బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు.