Wednesday, May 8, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ తో చేయను అంటున్నాడు!

- Advertisement -

హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ కుర్రాడిపై నెగెటివ్ వార్తలే భారీగా వస్తున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత ఈ హీరోకి పెద్ద బ్యానర్లలో మూడు భారీ ఆఫర్లు వచ్చాయి. దాంతో రాజ్ తరుణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు అంతా. అయితే ఏమైందో తెలీదు కానీ.. ఆ మూడు భారీ ఆఫర్లు తరుణ్ రేంజ్ దగ్గర నుంచి జారిపోయాయి. ఆ తర్వాత ‘ఈడోరకం ఆడోరకం’తో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో మళ్ళీ ఇతనికి రెండు మంచి అవకాశాలే వచ్చాయి.

ఈ సారైనా ఆ అవకాశాలను విజయవంతగా ముందుకు సాగుతాయి అనుకున్నారు. అయితే ఈ రెండులో ఓ  ప్రాజెక్ట్ మొదలు అయింది కానీ.. అనుకోకుందా అర్థంతరంగా ఆగిపోయిందని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌తో రాజ్ తరుణ్ 3 సినిమా డీల్ కుదుర్చుకున్నాడు. అందులో ‘ఈడోరకం ఆడోరకం’తో 1 సినిమా అయిపోయింది. ‘దొంగాట’ ఫేం వంశీతో ఈ యంగ్ హీరో రెండో మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దర్శకుడు వంశీ తేల్చి చెప్పేశాడు. కారణం.. ఏంటంటే దర్శకత్వ డిపార్ట్‌మెంట్‌లో రాజ్ తరుణ్ వేలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

కథ, దర్శకత్వం డిపార్ట్‌మెంట్‌లో రాజ్ తరుణ్ జోక్యం చేసుకుంటున్నాడట. దాంతో ఈ సినిమా నాకు చేయడం ఇష్టం లేదు అని వంశీ తప్పుకున్నట్టు తెలిసింది. ఇక ఈ సినిమా దాదాపు రద్దయినట్టే అని అంటున్నారు. దీంతో.. ఈ చిత్రాన్ని వేరే దర్శకుడితో తెరకెక్కించాలా? లేక సినిమానే రద్దు చేయాలా అని అలోచిస్తున్నారట. అయితే నిర్మాతలు మాత్రం ఓ లేడీ డైరెక్టర్ తో మళ్లీ  ఓ కొత్త సినిమా ని మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -