Thursday, April 25, 2024
- Advertisement -

స్టేజ్ మీదనే ఏడ్చేసిన రాజశేఖర్.. కారణం వాళ్ల అమ్మే..

- Advertisement -

హీరో రాజశేఖర్ తన న్యూ మూవీ ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఏఎం’ ఫ్రి రిలీజ్ వేడుక లో స్టేజ్ మీదనే ఏడ్చేశాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందు తన తల్లిని కోల్పోవడమే ఆయన ఉద్వేగానికి గురవడానికి కారణం. తన సక్సెస్ చూడాలని తన తల్లి ఎంతో తపించిందని.. గరుడవేగ రిలీజ్ కు కొన్నిరోజుల ముందే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగు పడ్డట్లయిందని రాజశేఖర్ అన్నారు.

ఆ బాధను దిగమింగుకుని ఈ వేడుకకు వచ్చామని రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఈ వేడుకలో రాజశేఖర్ ఏం చెప్పారంటే.. “ఈ గరుడ వేగ మూవీ నా కెరీర్ లో మంచి మూవీ. ఈ మూవీ టీజర్ కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా.. ఆ టైంలో మా అమ్మగారు నా దగ్గరే ఉన్నారు. నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మానాన్నలకు బాధ. చెన్నైలో ఉన్న ఆస్తులు అమ్మి అక్కడ సినిమాలు చేశా.. నాకు సూటవ్వని కొన్ని సినిమాలు చేసి ఇబ్బంది పడ్డాను. నాకే బాధ కలిగి ఇక సినిమాలే తీయకుడదు అనుకున్నా.. అలాంటి టైంలో గరుడవేగ అవకాశం వచ్చింది.

సినిమా రిలీజ్ టైంలో మా అమ్మగారు దూరం కావడంతో ఏంతో బాధగా అనిపించింది. నాకు ప్రతి క్షణం అమ్మే గుర్తుకొస్తోంది. జీవిత సోదరుడు.. ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ మురళి ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. కుటుంబమంతా మా బాధల్ని దిగమింగుకొని సినిమా కోసం అందరి ముందుకూ వచ్చాం. అందరూ థియేటర్లలో సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకొంటున్నాం’’ అని రాజశేఖర్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -