Wednesday, May 8, 2024
- Advertisement -

రాజశేఖర్‌కు హార్ట్ అటాక్.. కానీ షూటింగ్ కంప్లీట్ చేశారు.. ఎలానో తెలుసా..?

- Advertisement -

సీనియర్ హీరో రాజశేఖర్.. ‘పీఎస్‌వీ గరుడ వేగ’ తో రాబోతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. అయితే ప్రమోషన్ లో భాగంగా ఆయన కొంచెం డల్లుగా కనిపిస్తున్నారు. దీనికి కారణం అనారోగ్యమేనట. ఆయనకు కొన్ని నెలల కిందట హార్ట్ అటాక్ కూడా వచ్చిందట.

ఈ సంగతిని ఆయనే స్వయంగా చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నేను ఎన్‌ఐఏ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నా. మంచి ఫిట్‌నెస్‌తో కనిపించాలని ముందు వర్కౌట్లు చేశాను. షూటింగుకి సరిగ్గా నెల రోజుల ముందు కొన్ని రోజుల పాటు వరుసగా చెస్ట్ పెయిన్ వచ్చింది. దీంతో హాస్పిటల్‌కు వెళ్లాను. పరీక్షలు చేసి హార్ట్‌ ఎటాక్‌ అని చెప్పారు. షాకయ్యాను. తర్వాత స్టెంట్‌ వేశారు. కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా కానీ.. డాక్టర్లు చెప్పినన్ని రోజులు రెస్ట్ తీసుకునే వీలు లేకపోయింది.

అప్పటికే ఆలస్యం కావడంతో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇంకా విశ్రాంతి రెస్ట్‌ తీసుకుంటే మిగతా ఆర్టిస్టుల డేట్లకు ఇబ్బంది అవుతుందని షూటింగ్‌ నాకోసం వాయిదా వేయలేదు. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేశాం. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, అని రాజశేఖర్ చెప్పాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన పూజా కుమార్ హీరోయిన్ గా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -