Saturday, May 4, 2024
- Advertisement -

కూతురి పాలిట విలన్ అవుతున్నాడు!

- Advertisement -

యాంగ్రీ ఓల్డ్ మన్ రాజశేఖర్ త్వరలో విలన్ గా ముందుకు రానున్న విషయం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

చిరంజీవి 150వ సినిమాలో విలన్ గా చేస్తారని కొందరు.. రామ్ చరణ్ తని ఒరువన్ లో విలన్ రాజశేఖరే అని ఇంకొందరు.. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో రాజశేఖర్ విలన్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడని మరికొందరు.. చాలా విషయాలు ప్రచారం చేశారు.

కానీ.. తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తూ.. ఓ మంచి సినిమాకు రాజశేఖర్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారు. అందులో తను ఓ కీ రోల్ లో నటిస్తే.. మూవీకి మంచి క్రేజ్ తీసుకురావొచ్చని జీవితా రాజశేఖర్ అంచనాగా తెలుస్తోంది. అందునా.. విలన్ క్యారెక్టర్ చేస్తే.. ఈజీగా ప్రచారం కూడా చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట.

ఇది వర్కవుట్ అయితే.. సుమన్, జగపతిబాబు రూట్ లో హాయిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ కావాలన్నది రాజశేఖర్ ఫైనల్ టార్గెట్ అయి ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -