- Advertisement -
టాలీవుడ్ టాప్ హీరోయిన్గాఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిర్గా ఎదిగింది. మహేశ్ బాబు , ఎన్టీఆర్, బన్ని,రామచరణ్ వంటి హీరోలతో హీరోయిన్గా నటించింది. తమిళంలో కూడా సూర్య , కార్తి వంటి హీరోలతో నటించింది. అయితే ఈ మధ్య రకుల్కు సరైన అవకాశాలు రావడం లేదు. ఈ విషయం పక్కన పెడితే రకుల్ తన సోదరుడిని హీరోగా పరిచియం చేయడానికి రెడీ అవుతోంది.
రకుల్ సోదరుడు ‘అమన్’ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించినట్లు ఉన్నాయి. ‘అమన్’ హీరోగా దాసరి లారెన్స్ అనే దర్శకుడు ఓ సినిమాను తీయనున్నాడు. రజినీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.