ఒక్కప్పుడు వరుస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్కు ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. ఎందుకో ఏమో తెలియదు గానీ ఆమెకు తెలుగుతో పాటు తమిళ్లో సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్కు వెళ్లింది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు తమిళ్లో సూర్య పక్కన ప్రధాన హీరోయిన్గా తీసుకుంటారని టాక్ వినిపించింది. కానీ ఆ చాన్స్ సాయి పల్లవి కొట్టేసింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య 36వ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి.
తొలుత రకుల్ హీరోయిన్గా ఎంపికైందని తెలిసినా చివరికి సాయి పల్లవిని ఫైనల్ చేసేశారు. దీంతో నిరాశ చెందిన రకుల్ప్రీత్కు రెండో హీరోయిన్గా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. కథలో మరో లేడీ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండడంతో రకుల్ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్ అంటేనే క్రేజీ ప్రాజెక్టుగా అవతరించింది. గతంలో సెల్వరాఘవన్ తీసిన సినిమాలన్నీ ట్రెండ్ సెట్టింగ్గా మారడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా జనవరి చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని దీపావళికి సినిమా విడుదల చేయాలని ప్లాన్. మరోవైపు సూర్య నటించిన గ్యాంగ్ సినిమా తెలుగులో సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలవుతోంది.