టాలీవుడ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచియమైన ఈ భామ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మహేశ్ బాబు, ఎన్టీఆర్, బన్ని, రామ్ చరణ్ వంటి వంటి స్టార్ హీరోలతో, సాయి ధరమ్ తేజ్ , గోపిచంద్,రామ్ వంటి యంగ్ హీరోలతో కూడా నటించింది. కాని ఈ భామకు ఇప్పుడు సరైన అవకాశాలు రావడం లేదు. స్పైడర్ ఫ్లాప్ తరువాత రకుల్ను సినిమాలలోకి తీసుకోవాలంటే నిర్మాతలు భయపడిపోతున్నారు. తాజాగా ఈ భామ నటించిన దేవ్ సినిమా కూడా ఫ్లాప్ అయింది.
దీంతో రకుల్ను హీరోయిన్ తీసుకున్న సినిమా కూడా మిస్ అయిందని తెలుస్తోంది. నాగచైతన్య, వెంకీలు నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ను తీసుకున్నారు. కాని రకుల్ గ్రాఫ్ ఇప్పుడు ఘోరంగా పడిపోవడంతో రకుల్ను ఈ సినిమా నుంచి తప్పించారని తెలుస్తోంది. రకుల్ స్థానంలో రాశీ ఖన్నాను హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశిఖన్నా నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించంనుంది. ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
- Advertisement -
పాపం రకుల్ను ఆ సినిమా నుంచి తీసేశారట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -