బాహుబలి సినిమాతో కలెక్షన్స్ కొల్లగొట్టడంలో ఇండియాలోనే నంబర్ ఒన్ దర్శకుడు అనిపించుకున్నాడు రాజమౌళి. ఒక తెలుగు వాడిగా రాజమౌళి సాధించిన విజయం ఒకరకంగా అనితరసాధ్యమే. ఒక ప్రాంతీయ భాషా చిత్రం దేశం మొత్తం మీద నంబర్ ఒన్గా నిలుస్తూ అత్యంత ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టడం మామూలు విషయమా? అలాంటి బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్-చరణ్లతో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్లు అన్నదమ్ములుగా నటించబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ సినిమాలను ఇష్టపడే జనాలకు విందుభోజనంలా ఈ సినిమా ఉండబోతోంది. అద్భుతం అనిపించే స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉంటాయని జక్కన్న టీం చెప్తోంది.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా ప్రకటన రోజుని ఫైనల్ చేశాడు రాజమౌళి. 2018 సంక్రాంతి రోజున ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నాడు రాజమౌళి. ఆ రోజు కథకు సంబంధించిన విషయాలతో పాటు హీరోయిన్స్ ఎవరు అనే డిటెయిల్స్ కూడా చె్ప్పేస్తాడని తెలుస్తోంది. ఇక రాజమౌళి సినిమాలకు ఇప్పటి వరకూ వర్క్ చేస్తున్న అతని ఫ్యామిలీ మెంబర్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు కూడా కంటిన్యూ అవుతారు. ఓపెనింగ్ రోజున ఎన్టీఆర్-చరణ్లపై ఒక డైలాగ్ బిట్ని షూట్ చేయనున్నాడు రాజమౌళి. తెలుగు వారికి పండగ రోజైన సంక్రాంతి రోజే ఈ సినిమాను ప్రారంభించి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కి ఇంకాస్త ఎక్కువ ఆనందం పంచాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాతో రాజమౌళి ఏ స్థాయి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.