Friday, March 29, 2024
- Advertisement -

సోనూ సూద్​ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..! ప్లాన్ చేసిన కొరటాల..!

- Advertisement -

లాక్​డౌన్​లో సోనూ సూద్​ రియల్ హీరోగా మారిపోయాడు. ఆయన సేవలకు ఎల్లలు లేకుండా పోయాయి. ఎవరు సాయం అడిగినా కాదనకుండా హెల్ప్​ చేశాడు సోనూ సూద్​. ప్రస్తుతం ఆయన కరోనా నియంత్రణలోకి రావడంతో సినిమాలపై దృష్టి పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో సోనూ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో సోనూ, చెర్రీ మధ్య రెండు భారీ ఫైట్లు ఉన్నాయట. ఇందులో ఓ రైన్ ఫైట్​ ఉంటుందట. దీంతో పాటు ఓ కుస్తీ ఫైట్​ పెట్టేలా కొరటాల శివ ప్లాన్ చేసుకున్నారట. మామూలుగానే కొరటాల శివ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఈ కుస్తీ పైట్ కూడా ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం ఆచార్య మూవీ షూటింగ్​ తుది దశకు చేరుకున్నది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆచార్య మూవీ దసరా కానుకగా విడుదల చేయాలని ముందు భావించినప్పటికీ ఆర్ఆర్ఆర్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదలవుతున్నట్లు ప్రకటించడంతో ఆచార్య విడుదల డేట్ కూడా మారినట్లు సమాచారం. ఈ సినిమాను దసరా కంటే ముందుగానే సెప్టెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

Also Read

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

మెడకు పట్టితో ఫొటో షేర్ చేసిన అల్లు వారబ్బాయి..!

మళ్లీ సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -