మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా వైరస్ వల్ల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఈ మద్యనే మళ్లీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్ షరవేగంగా సాగుతుంది. తాజాగా ఈ సెట్స్లో రామ్చరణ్ అడుగు పెట్టారట.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ సెట్స్లోకి స్వాగతం రామ్చరణ్ అంటూ ట్వీట్ చేశారు. ‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించారు. దీంతో మొత్తానికి రామ్చరణ్ మీద షూటింగ్ ప్రారంభమైనట్లు క్లారిటీ వచ్చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను తేజ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.