Wednesday, May 22, 2024
- Advertisement -

ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్

- Advertisement -

మెగా వారసుడు రాంచరణ్ తేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఓ చిత్రం షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. బొంబాయి చిత్రంతో మెరిసి మాయమైన అరవింద స్వామి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాలో రాంచరణ్ కొత్త లుక్ తో కనిపిస్తాడని, ఇందుకోసం రాం ఎంతో కష్టపడుతున్నాడని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ ప్రారంభించి కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తామని, అనంతరం వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్ లో కొన్ని అందమైన సన్నివేశాలను తీస్తామని అరవింద్ చెప్పారు.

సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా కొత్తగా, స్టయిలిష్ తీస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఇక అరవింద స్వామి క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో నాజర్,పోశాని కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -