- Advertisement -
నిన్ను కోరితో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి.తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న నీవెవరో సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రెలర్ను విడుదల చేశారు.హీరో రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం అన్వేషిస్తోన్న యువకుడిగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు.
కామెడీ పోలీస్ గా వెన్నెల కిషోర్ సందడి చేస్తున్నాడు. కిషోర్ .. సప్తగిరి కామెడీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్ ను బట్టి అనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన తాప్సీ .. రితికా సింగ్ కథానాయికలుగా నటించారు.ఈ సినిమాకు హరనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.