చరణ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు షెడ్యూల్స్ కు చరణ్ హాజరుకాలేదు. మూడో షెడ్యూల్ నుంచి సెట్స్ లో జాయిన్ అయ్యాడు.
ఇటీవలే చరణ్ .. కైరా అద్వాని .. స్నేహ .. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కాంబినేషన్లో బోయపాటి కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. ఆ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు చరణ్ కి సంతృప్తికరంగా అనిపించలేదట. అందుకే మళ్లీ రీషూట్ చేయాలని బోయపాటికి సూచించారంట రామ్ చరణ్.
ఈ వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఓ 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక .. చరణ్ చెప్పిన సీన్స్ రీ షూట్ పెట్టుకుంటారట.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వివేక్ ఒబరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్.