రామ్ చరణ్ తాజాగా నటించిన మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ట్రైలర్ నిన్ననే (శుక్రవారం)విడుదల అయింది.యాక్షన్ , ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ టీజర్ మంచి మార్కులు దక్కించుకుంది. ఈట్రైలర్ ను వదిలిన 24 గంటల్లో 15.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది.
తెలుగులో ఒక్క రోజులోనే ఈ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇంతవరకూ ఇదొక్కటేనని చెబుతున్నారు. ట్రైలర్తోనే రికార్డులు సృష్టించిన రామ్ చరణ్ సినిమాతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమర్షయిల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది.సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయనున్నారు.