Thursday, April 25, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఇంట విషాదం!

- Advertisement -

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు… అనారోగ్యంతో మరణించిగా మరికొంత మంది కరోనా కాటుకు బలి అవుతున్నారు. ప్రతిరోజూ ఇండస్ట్రీ నుంచి ఏదో ఒక విషాద వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా రాంగోపాల్ వర్మ సోదరుడు నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమశేఖర్ మరణించారు. గతంలో రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఆయన ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా రామ్ గోపాల్ వర్మకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శ్వాస ఇబ్బందులు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందుతుండగానే.. ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. సోమశేఖర్ గురించి వర్మ ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు…తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్ ఒకరని పలు సందర్భాల్లో వర్మ స్వయంగా చెప్పారు. సత్య సినిమా చిత్రీకరణ సమయంలో ఆర్జీవీ కంటే సోమశేఖర్ ను చూస్తేనే ఎక్కువగా భయం వేసేదని.. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సోమశేఖర్ మృతి పట్ల బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందిస్తూ… తన తల్లి విషయంలో శేఖర్ ఎంతో జాగ్రత్త తీసుకునేవారని చెప్పారు. కరోనా సోకిన తర్వాత కూడా తల్లి గురించి తపించేవాడని తెలిపారు. తన తల్లిని కాపాడుకోగలిగాడే కానీ… తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. సోమశేఖర్ మృతి పై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?

జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త!

అతి వేగం ప్రాణం తీసింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -