యావత్దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించడంతో పలువురు సెలబ్రెటీలు మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ లోని నందిగ్రామ్ లో సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 221కి పైగా స్థానాల్లో విజయం సాధించిందన్నారు మమతా.
బెంగాలీలు దేశాన్ని కాపాడారన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి దీదీ విజయాన్ని తనదైన స్టైల్లో వీడియో షేర్ చేశారు. దీనికి ‘దీదీ ఓ దీదీ’ అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు.
ఓ మహిళ బ్యాగ్ తో వస్తుంటే.. బైక్ పై ఇద్దరు దొంగలు ఆమె బ్యాగ్ కొట్టేయాలని చూస్తారు.. ఆమె బ్యాగ్ పక్కకు విసరడంతో బ్యాక్ కోసం వెళ్తారు. అంతలోనే ఆమె బైక్ తీసుకొని వెళ్తుంది… లబోదిబో అంటూ బ్యాగ్ తో వస్తుంటే.. మళ్లీ ఆ లేడీ బ్యాగ్ కూడా తీసుకు వెళ్తుంది. అయితే ఈ వీడియో చూసి బీజేపీ అభిమానులు వర్మపై విరుచుకు పడుతున్నారు.
మినీ పోరు ఓట్ల లెక్కింపు ప్రారంభం..