ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా తమిళ సినిమాలను రీమేక్ చేసే వారు. తెలుగులో విడుదలైన సినిమాలు కూడా తమిళ్ లో రీమేక్ చేసే వారు. అయితే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ భాషల్లో విడుదలైన హిట్ సినిమాలను వరసగా తెలుగులో నిర్మిస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా నుంచి మలయాళ సినిమాలు రీమేక్ చేయడం ఎక్కువైంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ ను రీమేక్ చేస్తున్నారు.
అలాగే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తీస్తున్నారు. తాజాగా మలయాళంలో విడుదలైన మరో సినిమాను రానా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓటీటీలో విడుదలైన మలయాళ చిత్రం ‘మాలిక్’ సంచలన విజయం సాధించింది. ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మత ఘర్షణలు, రాజకీయనేతల కుయుక్తులు తదితర అంశాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
ఇక ఫహద్ ఫాజిల్ వృద్ధుడి పాత్రలో ఒదిగిపోయారు. ఫాజిల్ మలయాళ నటుడు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఓటీటీలో విడుదలైన అనుకోని అతిథి, ట్రాన్స్ వంటి చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు ఫాజిల్. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న పుష్ప చిత్రంలోనూ ఫాజిల్ విలన్గా కనిపించోతున్నాడు. ఇదిలా ఉంటే మాలిక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ నటుడు రానా భావిస్తున్నాడట. ఇప్పటికే రీమేక్ హక్కులు కూడా కొనుగోలు చేశారని టాక్. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది.
Also Read
బిగ్బాస్ 5 డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్లు ఎవరంటే?