Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్య అన్‌స్టాపబుల్‌కి బాలీవుడ్ టచ్‌!

- Advertisement -

నందమూరి బాలృష్ణ సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ఈ షోకి అదిరే రెస్పాన్స్ వస్తుండగా ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై షో రేటింగ్‌ని అమాంతం పెంచేశారు.

ప్రస్తుతం లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో స్పెషల్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేస్తుండగా రీసెంట్‌గా భగవంత్ కేసరి టీమ్ సందడి చేసింది. తాజాగా ఈ షోకు బాలీవుడ్ టచ్ ఇవ్వనున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మికా జంటగా నటించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి రానున్నారు రణబీర్, రష్మికా.

త్వరలోనే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన యానిమల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్‌లో ఘాటు ముద్దు సీన్స్ తో రెచ్చిపోయారు రణబీర్ – రష్మికా. మరి విడుదల తర్వాత యానిమల్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ పొందుతుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -