- Advertisement -
రాంచరణ్ మూవీ రంగస్థలం అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పరీక్షల సీజన్ వచ్చేసింది. ఎగ్జామ్స్ సీజన్ తర్వాత మొదటగా వచ్చే పెద్ద సినిమా రంగస్థలమే. పైగా దీని విడుదలకు మరో 21 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. అందుకే సినిమా ప్రమోషన్ మొదలుపెట్టింది టీమ్.
తాజాగా సినిమాలోంచి మూడో పాటను విడుదల చేశారు. ‘రంగమ్మా.. మంగమ్మా’ అంటూ సాగే ఈ పాట.. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సంగీతంతో ఆకట్టుకుంటుంది. రంగస్థలం’ చిత్రంలో ఇప్పటికే రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేసింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవీ శ్రీ సంగీతం సమకూర్చగా, ఎంఎం మానస ఆలపించారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.