ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీస్ లో దూసుకుపోతున్న శాండిల్ వుడ్ బ్యూటీ హీరోయిన్ రష్మిక మందాన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె మొదట నాగ శౌర్య హీరోగా నటించిన “చలో” మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ , సరిలేరు నీకెవ్వరు , భీష్మ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో నటించి అగ్ర కథానాయికగా కొనసాగుతోంది.
రష్మిక మందాన్న తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడు సందడి చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్లోకి వచ్చారు ఇందులో భాగంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చిన రష్మిక ఒక అభిమాని తన టాటూ గురించి అడగడంతో రష్మిక ఎంతో సరదాగా తాను వేయించుకున్న టాటూ అర్థాన్ని ఈ విధంగా వివరించింది నీకు నువ్వే ఉండాలి..నీకు నువ్వే మిగులుతావ్.. నీలాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.. ఇర్రిప్లేసబుల్ అని అంటూ టాటూ గురించి చెప్పుకొచ్చారు.
Also read:పూజా హెగ్డే మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సుల్తాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రష్మిక అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?