- Advertisement -
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనిస సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్కు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమా తరువాత రవితేజ ఆనంద్ అనే దర్శకుడితో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్తో తెరకెక్కనుందని సమాచారం.విభిన్నమైన కథా వస్తువులను ఎంచుకుని, ఆ కథలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం వి.ఐ. ఆనంద్ ప్రత్యేకత. అలాంటి ఆయన ఈ సారి ‘టైమ్ మిషన్’ నేపథ్యంలోని కథను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.నభా నటేశ్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను, డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.