Saturday, April 27, 2024
- Advertisement -

అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థిక సాయం

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది మనందరికి తెలుసు. ఈ బాహుబలి స్టార్ మరోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. రీసెంట్‌గా ఆయ‌న హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలైంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న అపశృతిలో ప్ర‌భాస్ అభిమాని ప్రమాదవశాత్తు మరణించారు. ఆ అభిమాని కుటుంబానికి రెండు ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించి అభిమాని కుటుంబానికి అండ‌గా నిలిచారు ప్రభాస్. రాధేశ్యామ్ విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద సంబరాలు చేసుకుంటుంగా… అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల ఓ అభిమాని చనిపోయారు.

ఈ విష‌యం తెలుసుకున్న హీరో ప్ర‌భాస్ ఆ అభిమాని కుటుంబానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి ఏ ఆప‌ద వ‌చ్చినా అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భాస్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ౩౦౦కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో పీరియాడిక్ ల‌వ్ స్టోరీ‘రాధే శ్యామ్’ను తెరకెక్కించారు రాధాకృష్ణ కుమార్. భారీ అంచ‌నాల న‌డుమ విడులైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకుంది. రిలీజ్‌ సంద‌ర్భంగా అభిమానులు థియేట‌ర్స్ వ‌ద్ద తమదైన శైలిలో రచ్చ చేశారు.

ప్ర‌భాస్‌కు భారీ క‌టౌట్స్ పెట్టి పెద్ద ఎత్తున పాలాభిషేకాలు నిర్వ‌హించారు. అయితే.. గుంటూరు జిల్లా కారంపూడి ప‌ల్నాడు ఐమ్యాక్ష్ థియేట‌ర్ వ‌ద్ద చ‌ల్లా కోటేశ్వ‌ర‌రావు అనే అభిమాని బ్యాన‌ర్ క‌డుతూ ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని డిస్ట్రిబ్యూట‌ర్, ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌గా, వెంట‌నే స్పందించిన ప్ర‌భాస్ అభిమాని కుటుంబానికి రెండు ల‌క్ష‌లు ఆర్థిక సాయాన్ని అందించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -