టాలీవుడ్ హీరో రవితేజ తమ్ముడు యాక్టర్ అయిన భరత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. రవిని ఆ పరిస్థితుల్లో చూడలేకనే.. తాము బయటకు రాలేకపోయాం అని.. ప్రమాదం జరగడానికి ముందు భరత్ పుట్టిన రోజుల వేడుకలు చేశాం.. ఆ తీపి గుర్తులు మాకు జీవితాంతం గుర్తు ఉండాలనే భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు అని రవి మీడియా ముందుకొచ్చి వివరించిన విషయం తెలిసిందే.
అయితే రీసెంట్ గా రవి గురించి ఒక వార్త ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. ఇదే తమ్ముడు చనిపోయి ఒక్కరోజు కాకుండానే రవి సినిమా షూటింగ్ కి హాజరయ్యాడు. హాజరవడమే కాకుండా ఏకంగా నటి నటులతో రవి సేల్ఫీ లు దిగడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రవి పై ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నెపథ్యంలో ఆయనలోని మానవీయత, అనుబంధాలు వంటి విషయాలెన్నిటినో చర్చకు పెట్టింది ఈ ఘటన.
.అయితే ఈ వివాదాలకు తెరదించేందుకు తన తమ్ముడి దశదిన కర్మల్లో స్వయంగా పాల్గొని పిండ ప్రదానం చేశారు రవితేజ.. అయితే తన తమ్ముడు భరత్ మరణించిన మరుసటి రోజు ఎందుకు షూటింగ్ కి వెళ్లింది, సెల్ఫీ లో ఎలా నిల్చొంది.. అన్నింటిపైనా ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాకు రవి వివరణ ఇచ్చారు.తోటి నటీ నటులను ఇబ్బంది పెట్టకూడదనే తాను అలా నవ్వు ముఖం పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే నటి హరి తేజ మాత్రం రవితేజ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం చేసుకోకుండా ఆ సెల్ఫీని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. దీంతో తమ్ముడు మరణించిన బాధ ఏమాత్రం లేకుండా రవితేజ హాయిగా తన పని తాను చేసుకుంటున్నారని సమాజానికి తప్పుడు సంకేతం వెళ్లింది అని ..ఈ నటి చేసిన ఈ పనికి రవిపై విమర్శలు చేస్తోన్నారు అని రవి అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.
{youtube}asIqRclcGM4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related