తమ్ముడి ముఖాన్ని చూడలేక.. చూడని విధంగా మారిన అతణ్ని చూసి తట్టుకునే శక్తి లేకే భరత్ కడసారి చూపులకు.. అంత్యక్రియలకు రవితేజ రాలేకపోయాడంటూ అతడి స్టాఫ్.. అతని సన్నిహితులు ముందే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికి రవితేజ వాదనను చాలామంది అంగీకరించలేకపోయారు.
అలా చేయడం కరెక్ట్ కాదన్నారు. అయితే ఇప్పుడు రవితేజే స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. భరత్ మరణంతో తాను.. తన కుటుంబం ఎంత వేదన చెందిందో వివరిస్తూ.. తమ ఊహల్లో సంతోషంగా కనిపిస్తున్న భరత్ను విగతజీవిగా.. అందులోనూ ముఖం ఛిద్రమైన స్థితిలో చూడలేక.. తల్లిదండ్రుల్ని ఆ విషాద స్థితిలో కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోనే భరత్ కడసారి చూపుకు రాలేదని రవితేజ స్పష్టం చేశాడు.
{loadmodule mod_custom,GA2}
ఈ సందర్భంగా చనిపోయిన వ్యక్తుల్ని చూడలేని తన ఫోబియా గురించి కూడా రవితేజ వివరించాడు. ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. చనిపోయిన వాళ్లను నేను చూడలేను. భయంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్లిన వాళ్లల్లో నేను కనిపించని విషయం గమనించే ఉంటారు. ఆ తర్వాత వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించేవాణ్ణి. ఐతే శ్రీహరి గారు చనిపోయినపుడు ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా గుండె దిటవు చేసుకుని.. ధైర్యం కూడగట్టుకుని చూసేందుకు వెళ్లాను. కానీ ఆయన ఇంటి దగ్గరకు కారు సమీపించగానే నాకు ఏదోలా అయిపోయింది. గుండెలో దడ మొదలైంది. దీంతో శ్రీహరి గారిని చూడకుండానే వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకున్న బలహీనత అది. బయటి వాళ్లనే ఆ స్థితిలో చూడలేకపోతే.. ఇక సొంత తమ్ముణ్ణి ఎలా చూస్తాను? ఎంత సినిమా ఆర్టిస్టులమైనప్పటికీ మా ఎమోషన్స్ మాకుంటాయి. భయాలుంటాయి. అవేం తెలుసుకోకుండా నిందలు వేయడం బాధాకరం’’ అని రవితేజ తెలిపాడు.
{youtube}WOk-N0Hj7iw{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related