పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘బద్రి’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన రేణు దేశాయ్.. ఈ మూవీ హీరోగా నటించిన పవన్ కళ్యాన్ ప్రేమలో పడింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ అఖిరానంద్, ఆద్య పిల్లలు పుట్టారు. ప్రస్తుతం తన సంతానంతో పూనేలో ఉంటుంది. అయితే రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోజు మూడు లక్ష కేసులు నమోదు అవుతున్నారు.. రెండువేలకు మరణాలు చేరాయి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారత్ లో కరోనా ఉధృతి పై రేణు దేశాయ్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. ఇప్పటికే ఎన్నో బాధలను లెక్కలేనంతగా భరించామని.. గాడిదల్లా తయారయ్యామని అభిప్రాయపడ్డ ఆమె, కేవలం బాధ పడేందుకు మాత్రమే ఈ శరీరం లేదని, బాధల్లోనూ చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవాలని సూచించారు.
కాస్తంత సంతోషంగా గడిపేందుకు కామెడీ వీడియోలను లేదా క్యూట్ గా ఉండే కుక్కపిల్లల వీడియోలను చూడాలని సూచించిన ఆమె, కాలం గడిచేకొద్దీ కష్టాలు కూడా తీరుతాయని చెప్పుకొచ్చారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అందరూ కరోనా ని ఎదిరించి తగు జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాదు సమాజాన్ని రక్షించుకోవాలని సూచించింది రేణు దేశాయ్.
తీన్మార్ మల్లనపై కేసు నమోదు.. కారణం అదేనా?