రీసెంట్గా ఖుషితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఇక తన తర్వాతి ప్రాజెక్టు పరుశరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో చేస్తున్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ నేపథ్యంలో సినిమా వస్తుండగా విజయ్ సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, సెకండ్ హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు.
ఇక తాజాగా సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. దసరా కానుకగా ఈ నెల 18న సినిమా టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దిల్ రాజుకు అచ్చొచ్చిన సంక్రాంతికి అంటే 2024 సంక్రాంతి రేసులో నిలవనుంది. ఏర్పాట్లు చేశారు. దసరాకు విడుదలయ్యే సినిమాలతో పాటు థియేటర్లలో టీజర్ ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయ్రి ఇది 13వ సినిమా కాగా కథలో కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. పరుశరామ్ గతంలో విజయ్తో గీతగోవిందం, మహేష్తో సర్కార్ వారి పాట వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశారు. ఈ సినిమా లైన్లో ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాతో పాటు కోలా రవికిరణ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుండగా ఈ సినిమాను దిల్ రాజే నిర్మిస్తున్నారు.